ఉప్పల్ మైదానంలో కాసేపట్లో IPL మ్యాచ్‌.. అభిమానులకు బిగ్ అలర్ట్

by Disha Web Desk 2 |
ఉప్పల్ మైదానంలో కాసేపట్లో IPL మ్యాచ్‌.. అభిమానులకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబద్ vs ముంజై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్లు మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో హైదరాబాద్ జట్టు గెలిచి తీరాలని జట్టు మీదుంది. ఈ క్రమంలో మ్యాచ్ చూసేందుకు మైదానం వెళ్లే అభిమానులకు హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు.

‘స్టేడియంలోకి ఎలాంటి వస్తువులను తీసుకెళ్లకూడదు. సిగరెట్, లైటర్, అగ్గిపెట్టె, ల్యాప్‌ ట్యాప్‌లు, బ్యానర్స్, బ్యాటరీలు, హెల్మెట్స్, ఫర్‌ఫ్యూమ్స్, బైనాక్యూలర్లు, ఎల్రక్టానిక్‌ పరికరాలు, కెమెరాలు, పెన్నులు, బయటి తిను బండారాలు, వాటర్‌ బాటిళ్లు స్టేడియంలోకి తీసుకెళ్లడానికి వీళ్లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మ్యాచ్‌ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 2800 పోలీసు సిబ్బందితో 360 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed