కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఘోరం.. కదులుతున్న రైలు ఎక్కబోయి..!

by Disha Web Desk 2 |
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఘోరం.. కదులుతున్న రైలు ఎక్కబోయి..!
X

దిశ, వెబ్‌డెస్క్: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి కాలు జారిపడి దుర్మరణం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాకు షేక్ ముస్తఫా(53) అనే వ్యక్తి తెనాలి వెళ్లటానికి గురువారం ఉదయాన్నే కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. క్రమంలో రేపల్లె ప్యాసింజర్ రైలును రన్నింగ్‌లో ఎక్కేందుకు ప్రయత్నించగా.. కాలుజారి రైలుకిద పడిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

Next Story

Most Viewed