HYD : భూతగాదాలతో వ్యక్తి కిడ్నాప్.. దారుణ హత్య

by Disha Web Desk 4 |
HYD : భూతగాదాలతో వ్యక్తి కిడ్నాప్.. దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా తీగాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న కొత్తూరులో కిడ్నాపైన కరుణాకర్ రెడ్డి హత్యకు గురయ్యారు. అయితే కిడ్నాపర్లు హత్యచేసి అనంతరం ప్రమాదంగా చిత్రీకరించారు. గచ్చిబౌలి సమీపంలో హత్యచేసి మృతదేహాన్ని కిడ్నాపర్లు ఆస్పత్రికి తరలించారు. కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి చితకబాది నిందితులు హత్య చేశారు. భూతగాదాలతోనే కిడ్నాప్ చేసినట్లు మృతుడి తల్లి ఆరోపించారు. ఓ ఎంపీపీపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి డెడ్ బాడీ ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది.



Next Story

Most Viewed