HYD : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి‌లో వ్యక్తి దారుణ హత్య

by Disha Web Desk 4 |
HYD : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి‌లో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు, దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్(46), మంజుల భార్యా భర్తలు, గండిమైసమ్మలో భవన నిర్మాణ సెంట్రింగ్ డబ్బాల షాప్ నిర్వహిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. దొమ్మర పోచంపల్లి కుడికుంట చెరువు దగ్గర రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. నిన్న రాత్రి హత్యకు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవ పరీక్ష నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. హత్యకు ఆర్ధిక లావా దేవీలే కారణం అయివుండవచ్చునని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed