HYD : ఎముకలు విరిచి.. బకెట్‌లో కుక్కి..

by Disha Web Desk 4 |
HYD : ఎముకలు విరిచి.. బకెట్‌లో కుక్కి..
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సనత్ నగర్‌లో సంచలనం సృష్టించిన బాలుడి హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. తొలుత బాలుడిని నరబలి ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా ఆర్థిక వ్యవహారాల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్ నగర్ లోని అల్లాదున్ కోటిలో వసీం ఖాన్ నివసిస్తున్నాడు. చిట్టీ వ్యాపారం నిర్వహించే ఫిజా ఖాన్ అనే హిజ్రా వద్ద వసీంఖాన్ చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించిన డబ్బులను ఫిజాఖాన్ ఇవ్వకపోవడంతో ఇద్దరికి గొడవ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఇద్దరికి గురువారం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కాలనీలో వసీం ఖాన్ కుమారుడిని అపహరించారు. ప్లాస్టిక్ సంచిలో ఫిజాఖాన్ ఇంటి వైపునకు తీసుకెళ్లారు. బాలుడు కనిపించడం లేదని వసీం ఖాన్ రాత్రి పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారాలతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. డెడ్ బాడీని జింకల వాడ సమీపంలోని ఓ నాలాలో పడేసినట్లు నిందితులు తెలపడంతో పోలీసులు గాలించి వెలికితీశారు. బాలుడిని హత్య చేసిన నిందితులు ఎముకలను ఎక్కడికక్కడ విరిచి బకెట్‌లో కుక్కారు. బకెట్ ను ప్లాస్టిక్ సంచిలో తీసుకుని వెళ్లి నాలాలో విసిరేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed