HYD : క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, Jr NTR

by Sathputhe Rajesh |   (  Updated:2023-11-30 02:08:44  IST  )

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది.

HYD : క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, Jr NTR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఇక, జూబ్లీహిల్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ పౌరులుగా క్యూలో నిల్చొని ఈ అగ్ర హీరోలు తమ ఓటును వినియోగించుకున్నారు. ఒక్క సారిగా హీరోలు లైన్ లో నిల్చొవడంతో ఇతర ఓటర్లు షాక్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని ఉన్నారు. వీరితో పాటు కీరవాణి కుటుంబ సభ్యులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు సెక్యూరిటీగా ఇరువైపుల సిబ్బంది ఉన్నారు. హీరోలను చూసేందుకు భద్రతా సిబ్బంది, ఓటర్లు ఆసక్తి చూపారు.

Next Story