భార్య పుట్టింటికి వెళ్లడం భరించలేక యువకుడు ఆత్మహత్య

by Disha Web Desk 2 |
భార్య పుట్టింటికి వెళ్లడం భరించలేక యువకుడు ఆత్మహత్య
X

దిశ, మెదక్ టౌన్: భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లాలోని నవాబ్ పేటలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నవాబ్ పేటకు చెందిన షేక్ జహంగీర్(23)కు మూడు నెల క్రితం మేడ్చల్‌కు చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత జహంగీర్ కుటుంబాన్ని సరిగా పట్టించుకోకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. మూడ్రోజుల క్రితం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో అలిగిన భార్య పుట్టింటికి వెళ్ళింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జహంగీర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed