- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పటాన్చెరులో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు కార్మికులకు సీరియస్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వనమాలి, సాలుబుర్స్ అనే రెండు ఫార్మా కంపెనీల్లో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడి ఆ మంటలు చుట్టుపక్కల మొత్తం వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకొని ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో రెండు కంపెనీల్లో మొత్తం 10 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఫైరింజన్ల సాయంతో ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story