MLC కవిత కోసం హోంమంత్రి ప్రత్యేక ప్రార్థనలు

by Disha Web Desk 19 |
MLC కవిత కోసం హోంమంత్రి ప్రత్యేక ప్రార్థనలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును పురస్కరించుకుని హోంమంత్రి మహమూద్​ అలీ సోమవారం రాజస్తాన్‌లోని‌‌ అజ్మీర్​ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను ఉసిగొల్పి ఇబ్బంది పెడుతోందని అన్నారు. కేంద్రం చేస్తున్న ఈ కుట్రలను బీఆర్ఎస్ ​సమర్థంగా ఎదుర్కోవటమే కాదు ధీటైన సమాధానం ఇస్తుందని చెప్పారు. ఇక, అజ్మీర్​ దర్గాకు వచ్చే తెలంగాణ వాసుల వసతి సదుపాయాలపై హోంమంత్రి మహమూద్​ అలీ స్థానిక అధికారులతో సమీక్ష జరిపారు.

రాజస్తాన్ ​మైనారిటీ శాఖ మంత్రి సలెహ్ ​మహ్మద్, కలెక్టర్​ అన్షిదీప్, అభివృద్ధి విభాగం అధికారి అక్షయ్ ​తదితరులతో చర్చలు జరిపారు. గతంలో వసతి సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం 2.40 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైన భూమి కొనుగోలు, రిజిస్ర్టేషన్ ​తదితర పనుల కోసం ఈ నిధులు వెచ్చించి త్వరితగతిన పనులు చేపట్టాలని సూచించారు. మంత్రి వెంట బీఆర్​ఎస్​ నాయకులు షరీఫుద్దీన్​, పుర్ఖాన్ ​అలీ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed