పాతబస్తీ అల్లర్లపై హోంమంత్రి సీరియస్: Mahmood Ali

by Disha Web Desk 12 |
పాతబస్తీ అల్లర్లపై హోంమంత్రి సీరియస్: Mahmood Ali
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియో కారణంగా హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ హైదరాబాద్ పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లర్లపై హోంమంత్రి మహ్మద్ అలీ మాట్లాడుతూ.. బీజేపీ నగరంలో శాంతిని చెడగొడుతుందని ఆరోపించారు. అలాగే, అల్లర్లకు కారణమైన వారు బీజేపీ అయినా, ఎంఐఎం అయినా వదిలేది లేదని హోంమంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు.

Next Story