ఆ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టండి: పోలీసులకు హోంమంత్రి మహమూద్ అలీ కీలక సూచన

by Disha Web Desk 19 |
ఆ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టండి: పోలీసులకు హోంమంత్రి మహమూద్ అలీ కీలక సూచన
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హత్యలు, హత్యాయత్నాలు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టటానికి మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్​ అలీ సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమషనరేట్ల పరిధుల్లో ఈ తరహా నేరాలు ఇటీవలిగా ఎక్కువగా జరుగుతున్నట్టు చెప్పారు. రాష్ర్టంలోని శాంతిభద్రతల పరిస్థితిపై డాక్టర్​బీ.ఆర్.అంబేద్కర్​సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ జితేందర్, ట్రై కమిషనరేట్ల కమిషనర్లు సీ.వీ.ఆనంద్, స్టీఫెన్​రవీంద్ర, డీ.ఎస్.చౌహాన్​తదితరులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

కాలనీలు, బస్తీలు, సున్నితమైన ప్రాంతాలు, జంక్షన్ల వద్ద మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా రెచ్చగొట్టే మెసేజీలను సోషల్​మీడియాలో పోస్ట్​చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని చెప్పారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న నేరాలపై సమీక్షలు జరుపుతూ వాటిని అరికట్టటానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జిల్లాల పునర్​వ్యవస్థీకరణ జరిగినట్టు తెలిపారు.

దాంతో పాటు పోలీస్​వ్యవస్థ పునర్​వ్యవస్థీకరణ జరిగిందని, ఈ క్రమంలో కొత్తగా కమిషనరేట్లు, జిల్లా పోలీస్, సబ్​డివిజనల్ కార్యాలయాలు, పోలీస్​స్టేషన్లు ఏర్పాటయ్యాయన్నారు. ఇదంతా శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా కాపాడటానికే అని చెప్పారు. రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిఘా పెట్టాలని చెప్పారు. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్​నేరాలకు కళ్లెం వేయటానికి మరింత పకడ్భంధీ చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్​నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.



Next Story

Most Viewed