సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణే నెంబర్ వన్: హోం మంత్రి

by Disha Web Desk 2 |
సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణే నెంబర్ వన్: హోం మంత్రి
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో/ముషీరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీసుశాఖ వినియోగిస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిందని హోంమంత్రి మహమూద్​అలీ అన్నారు. రాష్ర్ట అవతరణ నేపథ్యంలో నిర్వహించిన సురక్షా దివస్‌లో భాగంగా అంబేద్కర్​విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన జైళ్లు, అగ్నిమాపక శాఖ స్టాళ్లను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతిభద్రతలు సురక్షితంగా ఉన్న నేపథ్యంలోనే రాష్ర్టం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు.

డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. నేర పరిశోధనలో తెలంగాణా పోలీసులు ఉపయోగిస్తున్న ఆధునిక పరికరాలు మరే రాష్ట్రంలో లేవని చెప్పారు. తెలంగాణా పోలీస్ శాఖలోని 80 వేల మంది సిబ్బంది కృషి వల్లనే శాంతిభద్రతలు సురక్షితంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, అదనపు డీజీలు మహేశ్​భగవత్, విజయ్​కుమార్, షిఖా గోయల్, అభిలాష బిస్త్, స్వాతి లక్రా, సంజయ్​కుమార్​జైన్, సందీప్​శాండిల్య, ట్రై కమిషనరేట్ల కమిషనర్లు సీ.వీ.ఆనంద్, స్టీఫెన్​రవీంద్ర, దీ.ఎస్.చౌహాన్​తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సైబర్ సెక్యూరిటీ, రోడ్డు భద్రతపై పోలీసుశాఖ, టీఏఎస్ కే (టాస్క్)మధ్య ఎంఓయూ కుదిరింది. దీనిపై టాస్క్​సీఈవో శ్రీకాంత్​సిన్హా, ఐజీ రమేశ్​రెడ్డి, విశ్వజిత్​లు సంతకాలు చేశారు.



Next Story

Most Viewed