హైదరాబాద్‌లో నేడు అమిత్ షా పర్యటించే ప్రాంతాలివే!

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌లో నేడు అమిత్ షా పర్యటించే ప్రాంతాలివే!
X

దిశ, బేగంపేట: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్న అమిత్ షా... నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు రామ్ గోపాల్ పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ మీడియాకు వివరించారు. ఇప్పటికే ఆలయంలో ఏర్పాట్లను చూసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ సమాచారం ద్వారా తెలియజేసినట్లు వారు వివరించారు. మహంకాళి ఆలయ ఈవో మనోహర్ రెడ్డికి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అన్నిఏర్పాట్లు చేయాలని సూచించారు. అమ్మవారిని దర్శకునేముందే ఎయిర్‌పోర్టుకు సమీపంలోని రమద మనోహర్ హోటల్‌లో ముఖ్యమైన 20 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని బన్సీలాల్ పేట డివిజన్‌లోని దళిత కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శిస్తారని సమాచారం. అక్కడ నుండి నేరుగా మళ్లీ బేగంపేట ఎయిర్పోర్ట్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో నల్గొండ జిల్లా మునుగోడు బహిరంగ సభకు వెళ్లనున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించారు.

Next Story

Most Viewed