పామును ఎవరూ చంపొద్దని చెప్పి చేతితో పట్టుకోవడంతో..

by Disha Web Desk 4 |
పామును ఎవరూ చంపొద్దని చెప్పి చేతితో పట్టుకోవడంతో..
X

దిశ, ఉప్పునుంతల: పామును ఎవరూ చంపొద్దని అడ్డుకున్న వ్యక్తి తానే చంపుతానని చెప్పి పాము కాటు వేయడంతో చనిపోయాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లి గేటు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక హోటల్లో పనిచేస్తున్న ప్రసాద్(40) అనే వ్యక్తి మద్యం మత్తులో ఉండి హోటల్ వద్దకు వచ్చిన పామును ఇతరులు ఎవరు చంపొద్దని అడ్డుకున్నాడు.

తాను పట్టుకొని చంపేస్తానని పామును పట్టుకున్నాడు. ఇంతలో పాము అతన్ని మూడు చోట్ల కాటు వేసింది. దీంతో వెంటనే అతను పామును విసిరేశాడు. పాము కాటుకు గురైన విషయాన్ని గుర్తించి హోటల్ యజమాని గోగినేని రమేష్ చికిత్స నిమిత్తం అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. కాగా చికిత్స పొందుతూ ప్రసాద్ సోమవారం రాత్రి చనిపోయినట్లు తెలిపారు. అతను పనికి కుదిరినప్పటి నుండి పలుమార్లు హోటల్ యజమాని వివరాలు అడిగిన తాను అనాధనని అనే వాడని తెలిపారు.

అతని పూర్తి వివరాలు తమకు తెలియదని ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రసాద్ అనే వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే స్థానిక ఉప్పునుంతల లేదా అచ్చంపేట పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు. అతను పూర్తి వివరాలు తెలియ రాలేదని అందుకే ఎవరైనా గుర్తుపట్టినట్లయితే పూర్తి వివరాలు తెలపాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed