- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త డిగ్రీ కోర్సులపై ఉన్నత విద్యామండలి అవగాహన కార్యక్రమం
2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న కొత్త డిగ్రీ కోర్సులపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆన్లైన్ ఇంటరాక్టివ్ అవగాహన కార్యక్రమం జరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో : 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న కొత్త డిగ్రీ కోర్సులపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆన్లైన్ ఇంటరాక్టివ్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్, టీజీఎస్ డబ్ల్యూ ఆర్ఈఐఎస్, మరియు టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థలకు చెందిన 500 మందికి పైగా ప్రిన్సిపాళ్లు మరియు డిగ్రీ లెక్చరర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ కొత్త కోర్సులు విద్యార్థుల ఉపాధి అవకాశాలు మరియు సామాజిక ప్రాముఖ్యతను పెంపొందించేలా రూపొందించారని, ఆరు విశ్వవిద్యాలయాల వైస్-చాన్స్లర్లు, పరిశ్రమ నిపుణులు మరియు ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్లుగా ఆయన పేర్కొన్నారు.
కాలేజీలకు పాఠ్యపుస్తకాలు, నిపుణుల సేవలు, ఇంటర్న్షిప్ల కోసం కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు జాబితా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కోర్సుల నిర్మాణంలో టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, న్యాయ అంశాలు, పరిశోధన/ఇంటర్న్షిప్ అనే నాలుగు ముఖ్య భాగాలను సమన్వయం చేసినట్లుగా ఆయన వివరించారు. మారిటైం రంగం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, విద్యార్థులను ఆ దిశగా సిద్ధం చేయడం ఉపాధ్యాయుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కోర్సులను అమలు చేసే సంస్థలకు మండలి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని బాలకృష్టారెడ్డి హామీ ఇచ్చారు. సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






