- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana : నార్కట్ పల్లి - అద్దంకి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
by Muthe.Rajitha |
నార్కట్ పల్లి - అద్దంకి రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.

X
దిశ, వెబ్ డెస్క్ : నార్కట్ పల్లి - అద్దంకి రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీపావళి పండగ నేపథ్యంలో ఏపీ(AP)లోని సొంతూళ్లకు వెళ్లినవారు తిరగి నగరానికి చేరుకుంటున్నారు. తెల్లవారితే సోమవారం స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు ఉండటంతో.. పండగ సెలవులు ముగించుకొని హైదరాబాద్(Hyderabad) బాట పట్టారు. దీంతో పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దాదాపు 3 కిమీల మేర వాహనాలు నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు కూడా వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
Next Story






