'హాథ్​సే హాథ్'​ జోడో యాత్రకు ముహుర్తం ఫిక్స్.. 50 సెగ్మెంట్లు కవర్ చేసేలా T- కాంగ్రెస్ ప్లాన్!

by Disha Web Desk 19 |
హాథ్​సే హాథ్​ జోడో యాత్రకు ముహుర్తం ఫిక్స్.. 50 సెగ్మెంట్లు కవర్ చేసేలా T- కాంగ్రెస్ ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హాథ్​సే హాథ్​జోడో యాత్రకు ఏఐసీసీ నుంచి గ్రీన్​సిగ్నల్​ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 6న ములుగు జిల్లా సమ్మక్క, సారక్క ఆలయం నుంచి మొదలు పెట్టాలని ప్లాన్ ​చేస్తోన్నది. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో పాటు, టెంపుల్‌ను పార్టీ సెంటిమెంట్‌గా భావిస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది. అయితే తొలి విడత కేవలం 40 నుంచి 50 అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనే టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్ ఆధ్వర్యంలో హాథ్​సే హాథ్​జోడో యాత్రను నిర్వహించనున్నారు.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్​నగర్​ జిల్లాలకు బెల్ట్‌కి​ ప్రయారిటీ ఇస్తూ ఈ యాత్ర కొనసాగుతుందని ఓ ముఖ్య లీడర్ ​తెలిపారు. అయితే రూట్ ​మ్యాప్‌ను రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. 60 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు టీపీసీసీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించింది. అయితే ప్రియాంక గాంధీ పాల్గొనే ఛాన్స్​ఉన్నదని గాంధీభవన్​ వర్గాలు తెలిపాయి.

మిగతా సెగ్మెంట్‌ల పరిస్థితి ఏమిటీ..?

కాంగ్రెస్ ​పార్టీ గత కొన్ని రోజులుగా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అయితే హాథ్​సే హాథ్​ జోడో యాత్రను తొలి విడత కేవలం 50 నియోజకవర్గాలలోనే నిర్వహించాలని ఏఐసీసీ సూచించినట్లు టీపీసీసీ పేర్కొన్నది. ఈ రూట్ మ్యాప్​ ఎలా ఉంటుందోనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంటే.. మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కానీ కాంగ్రెస్​కేడర్​ఎక్కువగా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ హాథ్​సే హాథ్​జోడో యాత్ర కొనసాగే ఛాన్స్​కనిపిస్తున్నది. టీపీసీసీ మాత్రం తొలి విడత పూర్తయిన తర్వాత ఏఐసీసీ ముఖ్య లీడర్లతో చర్చించి మిగతా సెగ్మెంట్‌లపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీంతో మిగతా నియోజకవర్గాల్లోని కేడర్​నుంచి అసంతృప్తి రాగం వినిపించే ఛాన్స్​ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

''అదృష్టంగా భావిస్తున్నా: సీతక్క, ములుగు ఎమ్మెల్యే

హాథ్​సే హాథ్​జోడో యాత్ర ములుగు జిల్లా నుంచి ప్రారంభించాలని జాతీయ కాంగ్రెస్​పార్టీ నిర్ణయించడాన్ని సంతోషిస్తున్నా. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పార్టీని అధికారం తెచ్చే ప్రక్రియ మేడారం నుంచి మొదలు కావడం ఆనందాన్ని కల్గిస్తుంది. ఈ హాథ్​సే హాథ్​జోడో యాత్రలో ప్రతి గడపను టచ్​చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తాం. సమ్మక్క, సారక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రాబోతుందని విశ్వసిస్తున్నాం.''

Also Read...

ప్రజల్లోకి ''బడ్జెట్''.. ప్రతి గడపకు రీచ్ అయ్యేలా దేశవ్యాప్తంగా BJP స్పెషల్ డ్రైవ్!


Next Story

Most Viewed