- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కలిసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma)ను సోమవారం హరియాణా గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకుడు (Haryana Governor Bandaru Datthatreya)బండారు దత్తాత్రేయ హైదరాబాద్లోని రాజ్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma)ను సోమవారం హరియాణా గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకుడు (Haryana Governor Bandaru Datthatreya)బండారు దత్తాత్రేయ హైదరాబాద్లోని రాజ్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ, తన ఆత్మకథ పుస్తకం(Autobiography) తెలుగు వెర్షన్ “ప్రజల కథే నా ఆత్మకథ”ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అందించారు. ఈ సందర్భంగా తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాలని దత్తాత్రేయ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ పుస్తకం తన రాజకీయ, సామాజిక జీవితంలోని అనుభవాలు, తెలంగాణ ఉద్యమంలో పాత్ర, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం చేసిన కృషిని వివరిస్తుందని అన్నారు.
ఈ ఆత్మకథ ఇంగ్లీష్ వెర్షన్ “జనతా కీ కహానీ – మేరీ ఆత్మకథ” పేరుతో గతంలోనే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఆవిష్కరించారు. తాజాగా తెలుగు వెర్షన్ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ సమావేశంలో ఇద్దరు గవర్నర్లు తెలంగాణ, హరియాణా రాష్ట్రాల సాంస్కృతిక, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.






