- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: మొన్న హాస్టళ్లకు నేడు మెడికల్ కాలేజీలకు తాళాలు.. ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు?: హరీశ్ రావు
మెడికల్ కాలేజీకి తాళాలు వేసిన ఘటనపై హరీశ్ రావు రియాక్ట్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పాలనో మొన్నటి వరకు సంక్షేమ హాస్టళ్లకు తాళాలు.. నేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు తాళాలు వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి మంగళపల్లిలోని మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు (Govt Medical College) భవనానికి అద్దె చెల్లించలేదని భవన యజమానులు బిల్డింగ్ కు తాళం వేశారు. ఈ ఘటనపై హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని దుయ్యబట్టారు. కాగా భారత్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గతేడాది ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించారు. నెలలుగా అద్దె చెల్లించలేదని కళాశాలకు యజమానులు మంగళవారం తాళాలు వేశారు. నిన్న ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు తాళాలు ఉండటం చూసి షాక్ కు గురయ్యారు. అనంతరం ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని రెండు రోజుల్లో అద్దె చెల్లిస్తామని నచ్చజెప్పడంతో మళ్లీ తాళాలు తీసినట్లు తెలుస్తోంది.






