ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీశ్ రావు

by Disha Web Desk 4 |
ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీశ్ రావు
X

దిశ, ఖైరతాబాద్: రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకొని శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన మంత్రి హరీష్ రావు నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై సమీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇన్ చార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ వైద్య సేవలు అందించాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యుల‌ను ఆదేశించారు.

ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. కుటుంబానికి ధైర్యం చెప్పిన మంత్రి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విచారణ పూర్తి నిష్పాక్షికంగా జ‌రుగుతుంద‌ని, దోషులు ఎంత‌టివారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed