తెలంగాణ ప్రభుత్వంపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
తెలంగాణ ప్రభుత్వంపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్, బీజేపీలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ విమర్శలు కురిపించారు. కర్ణాటక ఫలితాల్లో బీజేపీ ఓటమిపై ఆయన చలోక్తులు విసిరారు. ఇప్పటికైనా బీజేపీకి జ్ఞానోదయం కలగాలని ఎద్దేవా చేశారు అటు కాంగ్రెస్ పైనా విమర్శనాస్త్రాలు కురిపించారు. కాంగ్రెస్ గెలిచినా అంతర్గత కుమ్ములాటలతో ముఖ్యమంత్రిని ఎన్నుకునే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మతోన్మాద బీజేపీకి, కుమ్ములాటల కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని గుత్తసుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Read More: `బండి´ మొబైల్ ఫోన్ ఎక్కడ?.. నెల దాటినా దర్యాప్తులో లేని పురోగతి



Next Story

Most Viewed