Gurukula Notification: డిగ్రీ విద్యార్థులకు తీపి కబురు.. గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్

by Disha Web Desk 1 |
Gurukula Notification: డిగ్రీ విద్యార్థులకు తీపి కబురు.. గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆర్‌డీసీ సెట్‌-2024 ను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్‌ 12 లోపు ఆన్‌‌లైన్‌ విధానంలో తమ అప్లికేషన్లను అందజేయాలి. అనంతరం హాల్‌ టికెట్ల డిస్ట్రిబ్యూషన్ ఏప్రిల్‌ 21 నుంచి వెబ్‌‌సైట్‌‌లో పెట్టనున్నారు. పూర్తి వివరాలకు విద్యార్థులు https://tswreis.ac.in/ వెబ్‌సైట్‌‌ను విజిట్ చేయాలని అధికారులు వెల్లడించారు. ప్రవేశ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుందని, ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజీలో ఇంటర్‌ సిలబస్‌ ఆధారంగా ప్రశ్నాపత్రం ఉండనుంది. ఈ పరీక్షలో సీటు పొందిన విద్యార్థులకు ఎలాంటి రుసుము ఉండదు. అయితే, కనీసం 50 శాతం మార్కులతో 2024 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.



Next Story

Most Viewed