కంటి వెలుగులో అంతా 'పింకే'.. గిన్నిస్​బుక్​రికార్డే లక్ష్యం

by Disha Web Desk |
కంటి వెలుగులో అంతా పింకే.. గిన్నిస్​బుక్​రికార్డే లక్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కంటి వెలుగు కార్యక్రమంలో బీఆర్ఎస్​పార్టీ కలర్​పింక్​అధికంగా కనిపించనున్నది. అద్దాల బాక్సులు, క్యాంపు బ్యానర్లు, జిల్లాల వారీగా విడుదల చేస్తున్న బుక్​లెట్​లు తదితర అన్నింటినీ పింక్​కలర్ లో రూపొందించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ జెండా కలర్​కూడా పింక్​కావడంతో ఇప్పుడు చర్చకు తెర తీసింది. పార్టీ ప్రమోషన్​కోసమే కంటి వెలుగును పింక్​మయం చేసినట్లు సోషల్​మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం గమనార్హం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో సర్కార్​ముందుకు సాగుతున్నది. జనవరి18వ తేదిన స్టార్ట్​కానున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో కోటి 5 లక్షల మందికి స్క్రీనింగ్​చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. కేవలం వంద రోజుల్లోనే అందరికీ స్క్రీనింగ్ పూర్తి చేసి అద్దాలు పంపిణీ చేయడంతో గిన్నిస్​బుక్​రికార్డు ఎక్కోచ్చని సర్కార్​అభిప్రాయ పడుతున్నది. అందుకే గతంలో లేనట్టుగా ఈ సారి ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని కూడా పెంచారు.

ఎక్కువ మందికి మేలు...

ఈ సారి కంటి వెలుగు క్యాంపులను సర్కారీ ఆసుపత్రులలోనే కాకుండా గ్రామ స్థాయిలోనూ పెట్టనున్నారు. దాదాపు కోటి మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. వీటిలో 30 లక్షల రీడింగ్, మరో 25 లక్షల మందికి ప్రిస్కిప్షన్​గ్లాస్​లను ఇవ్వనున్నారు. దీంతో ఎక్కువ మంది ప్రజలకు ఈ స్కీమ్​అందడంతో సహజంగానే పాజిటివిటీ పెరిగి, పార్టీకి మేలు చేస్తుందని బీఆర్ఎస్​ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అద్దాల కొనుగోలు కూడా పూర్తయినది. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది అప్తమాలజీ డాక్టర్లు భాగస్వామ్యం కానున్నారు. ఇతర టెక్నిషియన్లు, సపోర్టెట్​స్టాఫ్​కూడా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులతో పాటు మెడికల్​కాలేజీ దవాఖాన్లలో కంటి వెలుగుకు సపరేట్​విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి 'కేసీఆర్​కంటి వెలుగు' సెంటర్లుగా నామకరణం చేయనున్నట్లు తెలిసింది. ఇక్కడ ఏర్పాటు చేసే బ్యానర్లను కూడా పింక్​కలర్స్​లో కొట్టిస్తున్నట్లు ఓ అధికారి ఆఫ్​ది రికార్డులో తెలిపారు.

మొదటి విడతలో షాక్​...

2018 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కంటి వెలుగు స్ర్కీనింగ్ తో పాటు ఆపరేషన్లనూ స్టార్ట్​ చేసింది. ఆ తర్వాతి నెలలో వరంగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కంటి వెలుగు ఆపరేషన్లు వికటించి ఏకంగా 18 మంది చూపు కోల్పోయారు. ఇప్పటికీ చాలా మంది ఈ ఘటనతో హుటాహుటిన ప్రభుత్వం కంటి వెలుగు ఆపరేషన్లకు బ్రేక్​ వేసింది. తప్పిదాన్ని కప్పి పెట్టుకునేందుకు సదరు సర్జరీలు కంటి వెలుగు స్కీమ్‌లో చేయలేదని సర్కార్​దాట వేసే ప్రయత్నం చేసింది. చివరికి బాధితులు నోరు మెదపడంతో అసలు విషయం బట్టబయలైనది. దీంతో కంటి వెలుగు ఆపరేషన్లను గతంలో పూర్తిగా నిలిపివేశారు. మొదటి విడత కంటి వెలుగులో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసిన డాక్టర్లు, 6,42,290 మందికి క్యాటరాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శుక్లాలు), 3,16,976 మందికి పెద్దాపరేషన్లు అవసరమని తేల్చారు. అయితే పట్టుమని పది వేల మందికి కూడా సర్కార్ ఆపరేషన్లు చేయించలేకపోయింది. దీంతో ఈ సారి అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read....

తెలంగాణలోని ప్రతీ గుండెలో నిరాశ ఉంది: RSP



Next Story

Most Viewed