గ్రూప్ 4 పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ ఎప్పుడంటే?

by Dishanational2 |
గ్రూప్ 4 పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ ఎప్పుడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రూప్-4 ఉద్యోగాల కోసం పరీక్షల తేదీని టీఎస్పీఎస్సీ గురువారం ప్రకటించింది. జులై 1వ తేదీన గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 నిర్వహించనున్నట్లు పేర్కొంది. 8,180 పోస్టుల భర్తీకి గ్రూప్-4 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేయగా ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలతో గ్రూప్-4 దరఖాస్తులకు గడువు ముగియనుంది.


Next Story

Most Viewed