ప్రగతి భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. పాల్గొన్న సీఎం కేసీఆర్

by Disha Web Desk 19 |
ప్రగతి భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. పాల్గొన్న సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి వేడుకలు ప్రగతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. గణనాథుడుకి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.రాష్ట్ర ప్రజ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగ‌తి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ – శైలిమ దంప‌తులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి.. ప్రగతి భవన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed