Sankranti celebrations: ఢిల్లీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

by Prasad Jukanti |

కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి ఉత్సవాలకు హాజరైన ప్రధాని మోడీ

Sankranti celebrations: ఢిల్లీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) నివాసంలో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations in Delhi) ఘనంగా జరిగాయి. ఇవాళ సాయంత్రం నిర్వహించిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

Next Story