నానక్ రాం గూడ ఘటనపై స్పందించిన గవర్నర్

by Disha Web Desk 2 |
నానక్ రాం గూడ ఘటనపై స్పందించిన గవర్నర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర కలకలం రేపిన హైదరాబాద్ నానక్ రామ్ గూడ లో మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఈ ఘటనపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణం తనను కలిచి వేసిందని ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను 48 గంటల్లోపు తనకు అందజేయాలని సీఎస్, డీజీపీ, సీపీకి ఆదేశించారు. ఇక ఈ కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిందితులను తక్షణమే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed