రేపు జేఎన్టీయూ కాన్వకేషన్.. హాజరుకానున్న గవర్నర్ తమిళిసై

by Disha Web Desk 1 |
రేపు జేఎన్టీయూ కాన్వకేషన్.. హాజరుకానున్న గవర్నర్ తమిళిసై
X

దిశ, వెబ్‌డెస్క్ : జేఎన్‌టీయూ యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని రేపు నిర్వహించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు జవహర్‌లాల్ నెహ్రూ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు కాన్వకేషన్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్‌ హాజరుకానున్నారు. అదేవిధంగా యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా డాక్టర్ కట్టా.నర్సింహా‌ రెడ్డి నిర్వహణలో పలువురికి డాక్టరేట్ సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మరో చీఫ్ గెస్ట్‌గా ఇస్రో చైర్మన్ డా.శ్రీధరన్ పనికర్ సోమనాథన్ హాజరుకానున్నారు.


Next Story