సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళి సై

by GSrikanth |

స్వల్ప అస్వస్థత కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం గచ్చిబౌలిలో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళి సై
X

దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప అస్వస్థత కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం గచ్చిబౌలిలో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన తెలంగాణ గవర్నర్ తమిళి సై స్పందించారు. అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ఆమె ట్వీట్ చేశారు. కాగా, గతకొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే.. ఏఐజీ ఆస్పత్రి ప్రత్యేక వైద్య బృందం కేసీఆర్‌కు పరీక్షలు చేసింది. గ్యాస్ట్రిక్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.

Next Story