కాలుజారి కింద పడ్డ తెలంగాణ గవర్నర్ (వీడియో)

by Disha Web Desk 2 |
కాలుజారి కింద పడ్డ తెలంగాణ గవర్నర్ (వీడియో)
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ కాలుజారి పడిపోయారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. మార్టిన్ ఫౌండేషన్ అనే సంస్థ, ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ అండ్ స్పేస్ జోన్ ఇండియాతో కలిసి హైబ్రీడ్ సౌండింగ్ రాకెట్‌ను తయారు చేసింది. ఆదివారం తమిళనాడు చెంగల్‌పట్టు సమీపంలోని పట్టిపురం నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళి సై వేదిక వద్దకు నడుచుకుంటూ వెళుతూ కాలు జారటంతో కిందపడ్డారు. వెంటనే సహాయక సిబ్బంది ఆమెను పైకి లేపారు. ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.

వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/w_STbUBIs2g?feature=share


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed