మండలి చైర్మన్ గా గుత్తాను నియమిస్తూ గవర్నర్ గెజిట్

by Disha Web Desk 4 |
మండలి చైర్మన్ గా గుత్తాను నియమిస్తూ గవర్నర్ గెజిట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గుత్తా సుఖేందర్ రెడ్డిని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌదర్య రాజన్ బుధవారం గెజిట్ విడుదల చేశారు. ఈనెల 13న మండలి చైర్మన్ కు నామినేషన్ సేకరణ కార్యక్రమం, 14న ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్ కు ఒకే ఒక నామినేషన్ కావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే మండలి చైర్మన్ గా ఎన్నికైనట్లు గవర్నర్ గెజిట్ విడుదల చేశారు.





Next Story

Most Viewed