ప్రభుత్వ వెబ్‌సైట్ పనిచేయడం లేదు: పొన్నాల లక్ష్మయ్య

by Disha Web Desk 2 |
ప్రభుత్వ వెబ్‌సైట్ పనిచేయడం లేదు: పొన్నాల లక్ష్మయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​ప్రభుత్వం అవినీతిలో పేరుకుపోయిందని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పులు బయటకు రాకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. కాగ్ రిపోర్టును కూడా అందుకే రిలీజ్​చేయలేదని చెప్పారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అత్యంత తక్కువ రోజులు ఎందుకు? నడిపారో సీఎం కేసీఆర్​స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రభుత్వ వెబ్​సైట్లు కూడా పనిచేయడం లేదన్నారు. ఇరిగేషన్​ప్రాజెక్టుల మీద కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నట్లు చెప్పారు. కమీషన్ల కోసం కాంట్రాక్ట్‌లకు వర్క్‌లు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ జలయజ్ఞంలోనే 33 ప్రాజెక్టులు చేశామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే గూటి పక్షులన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

Next Story

Most Viewed