కొత్త సెక్రటేరియట్‌లో మీడియాపై ఆంక్షలు..! ఓపెనింగ్ రోజూ లిమిటెడ్ పాసులు.. జర్నలిస్టు సంఘాల ఆగ్రహం

by Disha Web Desk 13 |
కొత్త సెక్రటేరియట్‌లో మీడియాపై ఆంక్షలు..! ఓపెనింగ్ రోజూ లిమిటెడ్ పాసులు.. జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సెక్రటేరియట్లోనూ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోన్నది. నూతన సచివాలయం ప్రారంభానికి పరిమిత పాసులిచ్చిన ప్రభుత్వం.. ఇక నుంచి ఎప్పటికీ ప్రధాన కార్యాలయంలోని ఎంట్రీ లేకుండా చేయాలని సర్కార్​ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగా ప్రాంగణం బయటే మీడియా హాల్​ను ఏర్పాటు చేశారు. ప్రెస్​మీట్లు, మీడియా చిట్ చాట్ లు కూడా అక్కడ్నుంచే జరగనున్నాయి. కానీ సచివాలయం ప్రవేశం మాత్రం ఉండే అవకాశం కనిపించడం లేదు. రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఇతర అసిస్టెంట్లను కూడా రెగ్యులర్​గా పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.

కొత్త సెక్రటేరియట్​ లోకి మీడియా ఆంక్షలపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా.. ఇంటర్నల్​గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోన్నది. దీనిపై జర్నలిస్టుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీడియా పై వివక్ష తగదని హెచ్చరించాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవని, స్వరాష్ట్రంలో ఆంక్షలు విధించే సహించేది లేదని జర్నలిస్టుల నాయకులు మండిపడుతున్నారు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే సెక్రటేరియట్​ముందు ధర్నాకు దిగుతామని హైదరాబాద్​యూనియన్​ఆఫ్​జర్నలిస్టు సంఘం హెచ్చరించింది.

తాత్కాలిక భవనంలోనూ అంతే..

ఇన్నాళ్లు తాత్కాలికంగా రాష్ట్ర పరిపాలన భవనంగా కొనసాగిన బీఆర్​కే భవన్​లోనూ మీడియాపై ఆంక్షలు కొనసాగుతూ వచ్చాయి.కేవలం మంత్రులు ప్రెస్​మీట్లు పెట్టినప్పుడు జర్నలిస్టులను లోపలికి అనుమతి ఇచ్చారు. గతంలో జర్నలిస్టులపై ఆంక్షలు తగదని ప్రభుత్వాన్ని కోరినా.. స్పందించలేదు. రిపోర్టర్ల పరిస్థితే ఇట్లా ఉంటే సామాన్యుల సిచ్వేషన్​ఎలా? ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. కేవలం మీడియానే కాదు..కొన్ని సందర్భాల్లో ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టారు.

డిపార్ట్​మెంట్లకు సంబంధించి వర్క్​తో వచ్చినా..లోపలి నుంచి పర్మిషన్లు ఇస్తేనే అనుమతి ఇస్తామని సెక్యూరిటీ విభాగం తేల్చి చెప్పేది. ఉద్యోగుల ఐడీ కార్డులు చూపించినా...ఎన్నో సార్లు అనుమతించలేదు. చాలా మంది వెనుదిరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్​లోనూ ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని ఆర్​అండ్​బీకి చెందిన ఓ కీలక అధికారి తెలిపారు.

పేషీలపై ఫోకస్..

కొత్త సెక్రటేరియట్​లోని మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల పేషీపై సర్కార్​ఫోకస్​పెట్టనున్నది. ఎంట్రీ దగ్గర సమయం నుంచి ఎగ్జిట్ వరకు ప్రతీ నిమిషం రికార్డు కానున్నది. ఎవరు వస్తున్నారు? ఎంత సేపు ఉన్నారు? ఎవరెవర్నీ కలిశారు? ఎన్ని సార్లు ఆయా పేషీలకు వచ్చారు? అనే వివరాలన్నీ నమోదు కానున్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో ఇంటిలిజెన్స్​ఫోకస్​పెంచనున్నది. మీడియా పై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కొత్త సెక్రటేరియట్​లో సపరేట్​టీమ్​లను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.

ఎందుకీ ఆంక్షలు..

మీడియా సచివాయంలోని ఎంట్రీ అయితే ప్రభుత్వ తప్పిదాలు, నిర్ణయాలతో మిస్టేక్​లు వంటివన్నీ సులువుగా తెలిసే అవకాశం ఉన్నది. గతంలో ఎన్నో సార్లు సర్కార్ తప్పిదాలు వార్తల రూపంలో ప్రచురితం అయ్యాయి. మరి కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం అతి జాగ్రత్తతో వ్యవహరిస్తోన్నది. దీనిలో భాగంగానే మీడియాపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఉన్నతాధికారులను ప్రశ్నించినా..సెక్యూరిటీ రీజన్స్​అని సమాధానం ఇస్తున్నారు.


అసలు మీడియాతో ఎలాంటి ఇబ్బందనేది మాత్రం సదరు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. పై నుండి ఆర్డర్​ఎలా ఉంటే..తాము అట్లా ఫాలో అవుతామని తేల్చి చెబుతున్నారు. మీడియాపై ఇప్పటికైన వివక్ష చూపడం మానుకోవాలని, లేదంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తగదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య హెచ్చరించారు.

‘‘ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి..? బి అరుణ్​కుమార్, హెచ్​యూజే అధ్యక్షుడు

డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ ​కొత్త సెక్రటేరియేట్​ప్రారంభోత్సవం రోజు మీడియా పట్ల రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఓపెనింగ్ కు రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులకు ఎంట్రీ పాస్​లు ఇవ్వకుండా అవమానించడం బాధాకరం. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టులపై ప్రభుత్వం వివక్ష చూపడం మంచి పరిణామం కాదు. సచివాలయ ప్రారంభోత్సవం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. అలాంటి కార్యక్రమానికి కొందరిని ఆహ్వానించి.. మరికొందరికి పాస్​లు ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదు. డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​పేరు పెట్టి.. రాష్ట్ర జర్నలిస్టులను లోపలికి రానివ్వకుండా.. ఎండలో నిలుచోబెట్టి కవరేజీ ఇచ్చేలా చేయడం అత్యంత దారుణం.


ఇతర రాష్ట్రాల జర్నలిస్టులను పిలిపించుకుని.. రాచమర్యాదలు చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న మీడియా సంస్థలకు, జర్నలిస్టులను దూరం పెట్టడం సరికాదు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుడాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఖచ్చితంగా రాష్ట్ర మీడియా ప్రతినిధులందరికీ ఆహ్వానం ఇవ్వాల్సిందే. అదే సమయంలో గతంలో సెక్రటేరియేట్​లోకి అక్రిడేషన్​ కార్డు చూపి లోపలికి ఎంట్రీ ఇచ్చే విధానాన్నే మళ్లీ కొత్త సెక్రటేరియేట్​లోనూ అమలు చేయాల్సిందే..

‘‘పరాభవం తప్పదు: ఇ. చంద్రశేఖర్​ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్.



ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ఉందని నియంతృత్వ దోరణి తగదు. విర్రవీగితే పరాభవం తప్పదు. పత్రికా, పౌర స్వేచ్చను గౌరవించని పాలకులు చరిత్ర పూటల్లో హీనులు, నీచులు, అహంకారులుగా నిల్చిపొయిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ పాలకులకు గుర్తు పెట్టుకోవాలి. తెలంగాణ ప్రజల పక్షాన కలాన్ని, గళాన్ని విన్పించమే తాము చేసిన పాపం లా అనిపిస్తుంది ఇప్పుడు. ఉమ్మడి ఏపీలోనూ ఇలాంటి వివక్ష చూడలేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పరిమిత పాసులు ఏమిటీ? అంబేద్కర్​సాక్షిగా జర్నలిస్టులకు అన్యాయం జరిగింది. ఇక సహించేది లేదు.’’



Next Story

Most Viewed