రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాలో డబ్బులు పడేది అప్పుడే

by Dishanational2 |
రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాలో డబ్బులు పడేది అప్పుడే
X

దిశ, వెబ్‌డెస్క్ : రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది.ఇటీవల రాష్ట్రంలో భారీగా వర్షాలు పడిన విషయం తెలిసిందే. దీంతో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతులకు ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి, నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఎకరాకు పదివేల పరిహారం ఇస్తామని హామి ఇచ్చిన విషయం తెలిసిందే.

కాగా,నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 చొప్పున పరిహారాన్ని ఈనెల 12 నుంచి పంపిణీ చేయనున్నారు.గత నెలలో వడగండ్ల వానల వల్ల నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నివేదికలు సమర్పించింది. దీనితో పరిహారం పంపిణీ చేయాల్సిన తేదీని ప్రభుత్వం ప్రకటించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed