- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం నజర్.. కాసేపట్లో ప్రజాభవన్ లో కీలక భేటీ
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది.

X
దిశ, వెబ్ డెస్క్:తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నిర్వహణపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆగస్టు 26 నాటికి తమ నివేదికను సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ప్రజాభవన్లో ఈ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అడ్వకేట్ జనరల్ను కూడా ఆహ్వానించారు. తద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన న్యాయ సలహాలు తీసుకోనున్నారు. ఈ నివేదిక ఆధారంగా ఆగస్టు 29న జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story






