టీ.బీజేపీకి BIG షాక్.. కాంగ్రెస్‌లోకి గోషామహల్ కీలక నేత?

by Disha Web Desk 2 |
టీ.బీజేపీకి BIG షాక్.. కాంగ్రెస్‌లోకి గోషామహల్ కీలక నేత?
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ పార్టీ గోషామాహల్ నియోజకవర్గ కీలక నేత విక్రమ్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. అంతేకాదు.. కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరిపారని.. కాంగ్రెస్ నుంచి కూడా సానుకూల వాతావరణం ఉండటంతో చేరిక ఖరారు అయినట్లు తెలుస్తోంది.

అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో విక్రమ్ గౌడ్ బీజేపీ నుంచి గోషామహల్ టికెట్ ఆశించారు. అనూహ్యంగా సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ ఆ రాజాసింగ్‌కే టికెట్ ఇవ్వడంతో విక్రమ్ గౌడ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గోషామహల్‌లో రాజకీయంగా రాజాసింగ్ పాతుకుపోవడంతో తనకు టికెట్ రావడం ఇక ఎప్పటికీ కుదరదని విక్రమ్ గౌడ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం కాకముందే అనుచరులతో సమావేశమై.. నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



Next Story

Most Viewed