ఉద్యోగులకు TSRTC గుడ్ న్యూస్

by Disha Web Desk 4 |
ఉద్యోగులకు TSRTC గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లోని కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తున్నారన్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారీగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసిందన్నారు.



Next Story

Most Viewed