నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్ రెడీ!

by Disha Web Desk 1 |
నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్ రెడీ!
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. టీఎస్ ఆర్టీసీ సేవలు మరింత విస్తృతం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో మరో మూడు వేల కొత్త నియామకాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, అందుకు సంబంధంచి ఈ నెల 31న కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నియామకాలపై సీఎం రేవంత్ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సంస్థకతు మరో 3 వేల బస్సులను కొత్తగా కొనుగోలు చేస్తామని మంత్ర స్పష్టం చేశారు.

మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీలో రద్దీ బాగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. తాజాగా, 1,325 డీజిల్, 1,050 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటికి అనుసంధానం చేస్తూ మరో 3 వేల బస్సులు నూతనంగా కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోందని సమాచారం.

Next Story

Most Viewed