- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఒంటిపూట బడుల షెడ్యూల్ ఇదే
by Prasad Jukanti |
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.

X
దిశ, డైనమిక్ బ్యూరో:ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ఒంటిపూట బడులపై షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 15 నుంచి అకాడమిక్ ఇయర్ ముగిసే వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపూట బడలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని విద్యాశాఖ తెలిపింది. అయితే ఎక్కడైతే 10వ తరగతి పరీక్ష సెంటర్లు కొనసాగుతాయో ఆ స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వీరికి తొలుత మధ్యాహ్నభోజనం అందించి ఆ తర్వాత క్లాసులు నిర్వహించనున్నారు.
Next Story






