సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. పండుగకు 3 రోజుల ముందే ఆ డబ్బులు జమ

by Disha Web Desk 19 |
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. పండుగకు 3 రోజుల ముందే ఆ డబ్బులు జమ
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగకు మూడు రోజుల ముందే సింగరేణి కార్మికులకు ప్రభుత్వం స్వీట్ న్యూస్ చెప్పంది. పండగకు బోనస్ కింద ఇవ్వాల్సిన రూ.711 కోట్లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇది వరకు ప్రకటించిన విధంగానే సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను సింగరేణి కార్మికులకు దసరా బోనస్ అందించింది. శుక్రవారం ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కార్మికుల ఎకౌంట్లలో బోనస్ డబ్బులను జమ అయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.1.53 లక్షల బోనస్ ఇవ్వనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో పని చేస్తున్న 42 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరబోతున్నది. మరో ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. పండుగకు ముందే ఖాతాల్లో నగదు జమ కావడంతో కార్మికులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed