సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్

by Disha Web Desk 2 |
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి ఉద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) యాజమాన్యం తీపి కబురు అందించింది. 11వ వేజ్‌ బోర్డు ఏరియర్స్‌‌ను ఇవాళ విడుదల చేసింది. సంస్థ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశాలపై మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1,450 కోట్లు కార్మికుల బ్యాంక్‌ ఖాతాలో జమచేసింది. దీంతో సగటున ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.3.70 లక్షల ఏరియర్స్ జమకానుంది‌. అయితే. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి నగదు జమ అవుతుంది. త్వరలో దసరా, దీపావళి బోనస్‌ చెల్లింపులకు కూడా సింగరేణి యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Next Story