విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ప్రభుత్వ బడుల్లో

by Disha Web Desk 9 |
విద్యార్థులకు శుభవార్త.. ఇకపై  ప్రభుత్వ బడుల్లో
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కాగా.. ఈ విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడులలో చదివే 16.82 లక్షల విద్యార్థులకు రాగిజావా అందించనుంది. ఈ మేరకు మధ్యాహ్న భోజనానికి అదనంగా ఏడాదిలో 110 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్‌ను కొనసాగించనుంది. దీంతో ప్రధానమంత్రి పోషణ్ పథకం అమలుకు రాష్ట్రం ఇటీవలే ఆమోదం తెలపడం జరిగింది. ఇందుకు రూ. 27.16 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేసి.. కేంద్రం 16.18 కోట్ల రూపాయలు, రాష్ట్రం రూ.11.58 కోట్లు భరించనున్నాయి. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed