రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో రైతు బంధు డబ్బులు!

by Disha Web Desk 14 |
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో రైతు బంధు డబ్బులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు నగదు మరోసారి ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిసింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుబంధు స్కీమ్ డబ్బులు పడుతున్నాయి. దీంతో పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే నగదు నగదు ఖాతాలో పడుతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలోని 93 శాతానికి పైగా రైతులకు రైతుబంధు ఇస్తామని ఇటీవల జరిగిన కాబినేట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విడతల వారీగా రైతు బంధు నగదు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed