రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ

by Disha Web Desk 4 |
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతు బంధు పైసలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడుతున్నాయి. దీంతో పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రెండు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే పైసలు పడుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాత పథకం ప్రకారమే డబ్బులు అందినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న స్పష్టం చేశారు. మరోవైపు రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని ఆయన మంత్రి తెలిపారు.


Next Story