- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆశావహులకు తీపికబురు.. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఆశావహులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ (Assembly)లోని కమిటీ హాలులో కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీఎస్ రామకృష్ణ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రప్రథమంగా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. సర్కార్ తాజా నిర్ణయంతో సెప్టెంబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది.
అదేవిధంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు, సర్వే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని అసాధారణ పరిస్థితుల్లో సంబంధిత స్థానిక సంస్థల్లోని పరిస్థితుల ఆధారంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తవేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా విద్య, ఉపాధి, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకురావాలని నిర్ణయించారు. ఫ్రొఫెసర్ కోదండరామ్తో పాటు మహమ్మద్ అజారుద్దీన్ను శాసన మండలికి నామినేట్ చేస్తూ క్యాబినెట్ తీర్మానించింది.






