భవిష్యత్​తరాలకు ఆస్తులను కాదు.. వాతావరణం ఇవ్వండి : తలసాని

by Disha Web Desk |
భవిష్యత్​తరాలకు ఆస్తులను కాదు.. వాతావరణం ఇవ్వండి : తలసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో : భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆహ్లాదకరమైన వాతావరణం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన నర్సరీ మేళాను ఆయన ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన మొక్కలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి మొక్కలను పరిశీలించారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అనే గొప్ప కార్యక్రమం చేపట్టి ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలను నాటుతున్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అనేక రకాల మొక్కలు ఒకే చోట లభించే విధంగా గ్రాండ్ నర్సరీ మేళాను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు.

ఇవి కూడా చదవండి: కౌశిక్‌కు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు : డీకే అరుణ

Next Story

Most Viewed