- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
GHMC కార్మికులపై రాళ్లు, ఇటుకలతో దాడి (వీడియో)
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో జీహెచ్ఎంసీ కార్మికులపై కొబ్బరిబోండాల వ్యాపారులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా ఇవాళ ఉదయం GHMC సిబ్బంది క్లీనింగ్కు వెళ్లారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ - సులేమాన్ నగర్ పరిధిలో ప్రధాన రహదారిపై ఫుట్పాత్ మీద కొబ్బరి బోండాలు అమ్మొద్దని అక్కడున్న వ్యాపారికి చెప్పారు. వినకపోవడంతో అమ్ముతున్న వారిని GHMC ఎన్ఫొర్స్మెంట్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సదరు వ్యాపారి GHMC సిబ్బందిపై తన అనుచరులతో కలిసి విచక్షణారహితంగా ఇటుకలతో, రాళ్లతో తలపై దాడి చేశారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
ఫుట్పాత్ మీద కొబ్బరిబోండాలు అమ్మొద్దు అంటే దాడి చేశారు
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024
రాజేంద్రనగర్ - సులేమాన్ నగర్ పరిధిలో ప్రధాన రహదారిపై ఫుట్పాత్ మీద కొబ్బరి బోండాలు అమ్ముతున్న వారిని GHMC ఎన్ఫొర్స్మెంట్ సిబ్బంది తొలగిస్తుండగా విచక్షణారహితంగా ఇటుకలతో, రాళ్లతో తలపై దాడి చేశారు. pic.twitter.com/3MM7DZrUIP