- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దూకుడు పెంచిన అధికారులు.. హైదరాబాద్ యువతకు గుడ్ న్యూస్

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ క్రీడల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. ఇండోర్ క్రీడల నుంచి మొదలుకుని క్రికెట్, ఇతర అవుట్డోర్ క్రీడలపై కూడా శిక్షణ నిర్వహిస్తోంది. దీంతోపాటు అన్ని క్రీడలకు సంబంధించిన మైదానాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మహానగరంలో ఫుట్ బాల్ స్టేడియాలు మాత్రం లేవు. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్లేయర్ కావడంతో వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్న నగరంలో ఒక్క ఫుట్ బాల్ స్టేడియం లేకపోవడం విడ్డూరమని ఫుట్ బాల్ క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుట్ బాల్ స్టేడియాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అందుకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది.
6 ఫుట్ బాల్ స్టేడియాలు..
జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు ఫుట్ బాల్ స్టేడియాలు ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్లో 5 ఎకరాలకుపైగా ఉన్న 8 స్థలాలను గుర్తించారు. వీటిలో జోన్కు ఒకటి చొప్పున 6 జోన్లలో 6 స్టేడియాలను ఏర్పాటు చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఒక్కో స్టేడియానికి సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి..
జీహెచ్ఎంసీ నిర్వహించే శిక్షణా శిబిరాల్లో ట్రైనింగ్ తీసుకున్న అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారెందరో ఉన్నారు. క్రికెటర్ అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ల నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధూ వరకు ఎందరో జీహెచ్ఎంసీ క్రీడా మైదానాల్లో శిక్షణ పొందినవారే. అయితే ఇదే తరహాలో ఫుట్ బాల్ ప్లేయర్లను కూడా తయారు చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సాహకం అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారు. అందులో భాగంగానే ఫుట్ బాల్ స్టేడియాలను ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.