- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బిగ్ షాక్.. మీటింగ్ కు పలువురు కార్పోరేటర్లు డుమ్మా

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) గద్వాల విజయలక్ష్మి (Gadwala Vijayalakshmi)కి బిగ్ షాక్ (Big Shock) తగిలింది. మేయర్ ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు కార్పోరేటర్లు (corporators) డుమ్మా కొట్టారు. అవిశ్వాస తీర్మానం, ఎల్లుండి జరగబోయే కౌన్సిల్ (council meeting) సమావేశంపై కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి చెందిన కార్పోరేటర్లతో మేయర్ ప్రత్యేక సమావేశం (Special Meeting) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ మేయర్ (former deputy mayor), బొరబండ కార్పొరేటర్ (Borabanda corporator) బాబా ఫసీయుద్దీన్ (Baba Fasiuddin) సహా 15 మంది కార్పోరేటర్లు హాజరు కాలేదు. వీరంతా మేయర్ విజయలక్ష్మి ధోరణిపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. అందుకే కార్యక్రమానికి హాజరు కాలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో మేయర్ కు పదవీ గండం పట్టుకుందనే చర్చ మొదలైంది.
అవిశ్వాసం ఎదుర్కొవాల్సిందేనా..?
కాగా జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ (BRS party) విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working president KTR) సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్పోరేటర్లు విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయని, ఇందులో భాగంగానే మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని అంశం కూడా చర్చకు వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే పదవీకాలం నాలుగేళ్లు పూర్తి అవ్వాలన్న నిబంధన ఉన్నది.
మేయర్ కు పదవీగండం..!
జీహెఎచ్ఎంసీ ఎన్నికలు జరిగి, మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల 10 వ తేదీకి నాలుగేళ్లు పూర్తి అవుతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో మేయర్ నిర్వహించిన మీటింగ్ కి కార్పోరేటర్లు డుమ్మా కొట్టడం ఆసక్తికరంగా మారింది. మీటింగ్ కు హాజరు కాని కార్పోరేటర్లలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ వర్గం వారు ఉన్నారని తెలుస్తోంది. వీరంతా మేయర్ తీరుపై తీవ్ర అసహనంలో ఉన్నారని, అవిశ్వాసం పెడితే మేయర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే నిజమైతే మేయర్ విజయ లక్ష్మికి పదవి గండం తప్పదా అనేది రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.