నిమజ్జనం చెత్త 10 వేల మెట్రిక్ టన్నులు.. 110 జేసీబీలతో క్లీనింగ్..!

by Disha Web Desk 2 |
నిమజ్జనం చెత్త 10 వేల మెట్రిక్ టన్నులు.. 110 జేసీబీలతో క్లీనింగ్..!
X

దిశ, సిటీ బ్యూరో: మహానగరంలో రెండు రోజుల పాటు జరిగిన వినాయక నిమజ్జనంలో భాగంగా జీహెచ్ఎంసీ సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి 527 వాహనాలతో శివారులోని జవహర్ నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికార వర్గాల సమాచారం. ముఖ్యంగా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు దాదాపు 21 కిలో మీటర్ల పొడువున సాగిన శోభాయాత్ర, ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెం. 4 వరకు సాగిన ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జన యాత్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ వరకున్న నిమజ్జన రూట్లలో ఎప్పటికప్పుడు చెత్తను సేకరించేందుకు 10 వేల 476 మంది కార్మికులను నియమించి.

ఈ చెత్తను సేకరించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం వరకు ముగిసినట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ చుట్టూ శుక్రవారం రాత్రి వరకు కార్మికులు చెత్త సేకరణ, స్వీపింగ్ విధులు నిర్వహించారు. దీంతో పాటు వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ శాశ్వత, తాత్కాలిక, ఎక్సవేటర్ పద్దతుల్లో ఏర్పాటు చేసిన 74 నిమ జ్జన కొలనుల నుంచి వెయ్యి మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు గాను రెగ్యులర్‌గా వినియోగించే 330 వాహనాలతో పాటు అదనంగా మరో 97 వాహనాలు, అలాగే రెగ్యులర్‌గా వినియోగించే 40 జేసీబీలకు అదనంగా మరో 70 జేసీబీలను వినియోగించి ఈ చెత్తను తీసినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్‌తో పాటు మరికొన్ని చెరువులు, కొలనుల్లో చెత్తను ఇంకా సేకరించి, తొలగిస్తున్న ప్రక్రియ జరుగుతున్నందున, శనివారం ఉదయం వరకు ఈ చెత్త మరిన్ని టన్నులు పెరిగే అవకాశముంది.

కొనసాగుతున్న వ్యర్థాల సేకరణ

హుస్సేన్ సాగర్‌లోని వ్యర్థాలు, పూజాసామగ్రిని వేర్వేరు చేసి జీహెచ్ఎంసీకి ఎంటమాలజీ విభాగం కార్మికులు ఇంకా సేకరిస్తున్నారు. ఒక్క హు స్సేన్ సాగర్ చెరువు వద్దనే వ్యర్థాల సేకరణకు సుమారు వందమంది కార్మికులను నియమించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మరో 33 ప్రాంతాల్లోని చెరువుల వద్ద వ్యర్థాల సేకరణ సాయంత్రంతో ముగియగా, జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పాండ్ల వద్ద వ్యర్థాల సేకరణ శుక్రవారం ఉదయంతో ముగినట్లు తెలిసింది.



Next Story

Most Viewed